CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన దర్బార్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి : ఐటీడీఏ పీవో అంకిత్.

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం:

ప్రజా దర్బారులో వచ్చిన ఫిర్యాదులను అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని పివో అంకిత్ అన్నారు.సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 21 దరఖాస్తులు రాగా తనే స్వయంగా స్వీకరించడం జరిగింది.ఏటూరు నాగారం మండలం లోని దొడ్ల గ్రామం పరిధిలోని దొడ్ల కొత్తూరు తాడ్వాయి ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్ 168,171 లో పోడు చేసుకున్న భూమిని ఆక్రమించుకున్న గిరిజనేతరలను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో శ్రీ గోవిందరాజుల జాతరకు 2023వ సంవత్సరానికి జాతర నిధులు మంజూరు చేయాలని పివో కు పూజారులు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పోచం,ఏవో దామోదర స్వామి, మహబూబాబాద్ ఆర్సిఓ రాజ్యలక్ష్మి,పి హెచ్ ఓ రమణ, ఎస్ఓ రాజ్ కుమార్,మేనేజర్ శ్రీనివాస్,సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: