మన్యం న్యూస్ , దుమ్ముగూడెం, నవంబర్ 7::
మండలంలోని రేగుబల్లి గ్రామపంచాయతీ రేగు బల్లి కాలనీలో జిల్లా ఇన్చార్జి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిడిపి నిధులతో నూతనంగా 2.60 లక్షల తో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి. అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామపంచాయతీ ద్వారా ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణాల ద్వారా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండలం కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి జానీ పాషా, స్థానిక సర్పంచ్ మోహన్ రావు, టిఆర్ఎస్ నాయకులు దామెర్ల శ్రీనివాసరావు, మోతుకూరి శ్రీకాంత్, పోడియం సుబ్బారావు, జెట్టి రాజేష్, జిలకర గంగరాజు, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: