మన్యం న్యూస్, గుండాల: మండలం పరిధిలోని దేవల్లగూడెం గ్రామానికి చెందిన ఈసం ఉదయ్ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కాలేజీకి పోవటం లేదని మందలించడంతో మనస్థాపం చెందిన ఉదయ్ రెండు రోజుల క్రితం రోల్లగడ్డ గ్రామ సమీపంలో పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు .కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు.
Navigation
Post A Comment: