మన్యం న్యూస్, గుండాల: ఆళ్లపల్లి మండలంలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే వేటు తప్పదని ఎంఈఓ పి కృష్ణయ్య హెచ్చరించారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల సమయపాలన కంటే ముందే పాఠశాలకు చేరుకొని సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు. పలు పాఠశాలల్లోని విద్యార్థులను ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు రమేష్ పాల్గొన్నారు
Navigation
Post A Comment: