మన్యం న్యూస్, మణుగూరు : రౌడీ షీటర్లు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు అన్నారు. ఆయన సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించ వద్దన్నారు. గొడవలకు దూరంగా ఉండాలని ఇలా కాకుండా వ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు ముత్యం రమేష్, రాజగోపాల్, శ్రీనివాసరావు, ఎస్ఐలు రాజ్ కుమార్, పురుషోత్తం టీవీఎస్ సూరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: