CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై కళ జాత

Share it:


మన్యం న్యూస్ ,దమ్మపేట :

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మం జిల్లా  (నాబార్డు) వారి ఆధ్వర్యంలో దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామం లో గురువారం ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై  కళ జాత నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బుర్రకథ/ జానపద కళారూపాలు ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పంట ఋుణాలు, పశాజింగ్ లోన్, విద్యాబుణాలు, బంగారం పై ఋుణాలు, ముద్రా లోన్స్ నగదు రహిత లావాదేవీలు పై అవగాహన కార్యక్రమాలు, సైబర్ నేరగాళ్లు గురించి జాగ్రత్తలు తెలియజేశారు. 436 రూపాయలకే 18-49సంత్సరాల వాళ్ళకి జీవనజ్యోతి భీమా, 18- 70 సంవత్సరాలు  వాళ్ళకి సురక్షిత భీమా ద్వారా  సంవత్సరానికి 20 రూపాయలు కట్టాలి దీని ద్వారా సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు అయితే 2 లక్షల రూపాయలు ఇన్నసూరెన్స్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది భరత్, కిషోర్, అల్లం వెంకమ్మ , రావుల ముత్యాలు, వెంకులు, మహాలక్ష్మి , సుభద్ర, బుచ్చిరాజు మరియు గ్రామస్తులు పాల్లొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: