మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలో మత్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్న మాట్లాడుతూ, మండలంలోని ఏడూళ్ళ బయ్యారం, ఎల్చిరెడ్డిపల్లి, జానంపేట, పినపాక, ఉప్పాక పంచాయతీలకు సంబంధించిన చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేశామని తెలియజేశారు. ఆయా పంచాయతీలకు సంబంధించిన చెరువులలో చేప పిల్లలను మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ సమక్షంలో చెరువులలో వదిలి వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ఎంపీటీసీ కాయం శేఖర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ఆయా పంచాయతీల ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: