మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం పోట్లపల్లి గ్రామపంచాయతీ పోట్లపల్లి గ్రామ యువజన విభాగంనూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ కార్యక్రమంలో పినపాక మండల యువజన విభాగం ఇంచార్జ్ బోశెట్టి రవి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న, చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోపినపాక మండల యువజన విభాగం అధ్యక్షులు గాండ్ల అశోక్, పోట్లపల్లి గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట నరసయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు గొంది నాగభూషణం, పడిగ నాగేశ్వరరావు, పూనెం బక్కయ్య, గుస్సా నారాయణ, పోలెబోయిన నాగేశ్వరరావు, అంబాజీ తిరుపతయ్య, పోలబోయిన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: