మన్యం న్యూస్, గుండాల: పినపాక మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గుండాల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంతో పాటు శంభుని గూడెం, వెన్నెల బైలు, ముత్తాపురం, కొడవుటంచ తదితర గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనారోగ్య కారణాలవల్ల మరణించిన వారి కుటుంబాలను సైతం పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సమ్మయ్య, అజ్మీరా మోహన్, ఎస్.కె ఖదీర్, మాజీ ఎంపీపీ పద్మ, అశోక్, రాంబాబు, బాబురావు, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: