మన్యం న్యూస్ వాజేడు, నవంబర్ 19 డైలీ వేజ్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదివాశకుల పోరాట సమితి మండల కార్యదర్శి సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండలంలో పేరూరు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వాదిక సమ్మెకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ మాట్లాడుతూ 22 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాల హాస్టల్స్ లో విధులు నిర్వహిస్తున్న డైలీ వేస్ వర్కర్లు, సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. వారి డిమాండ్స్ ని పరిగణలోకి తీసుకొని న్యాయమైన డిమాండ్ ని పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొడ్డే అనిల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: