మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 19::
దళిత బంధు పథకం అర్హులైన వారందరికీ తప్పకుండా అందజేస్తామని ఈ విషయంలో దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు తెలిపారు శనివారం దుమ్ముగూడెం టిఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కలిసి మండలంలోని వివిధ సమస్యల ఆయనకు తెలుపుతూ ప్రధాన సమస్య అయిన దళిత బంధు విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ దళిత బంధు పథకం అందరికీ వర్తింప చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు దళారులను నమ్మి దళిత బంధు పథకం ఇస్తానని చెప్పే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. పెండింగ్లో ఉన్న రహదారులు కూడా మంజూరు చేపిస్తానని అలాగే పోడు భూములపై హక్కులు కల్పించేందుకు సర్వే పనులు ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, సొసైటీ డైరెక్టర్లు వెంకట్రావు, పూర్ణయ్య, తిరుపతిరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్, నాగరాజు, కొత్త మల్లేష్, నాయకులు జయసింహ, సుబ్బారావు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: