మన్యం న్యూస్, దమ్మపేట:
దమ్మపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం లో గర్భిణీ మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన బత్తుల సబ్బు, హాసిని దంపతులు దమ్మపేట మండలం రాచురుపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తుండగా, దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామ శివారులో దమ్మపేట ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులను ఢీకొట్టింది,ఈ సంఘటనలో బత్తుల హసిని గర్భిణి మృతి చెందగా,ఆమె భర్తకు బత్తుల సబ్బుకు తీవ్ర గాయాలయ్యాయి.
Post A Comment: