CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీసీ బంగారు భవిష్యత్ వాష్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం....

Share it:


మన్యం న్యూస్, మణుగూరు: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం ఘన వ్యర్ధాలపై అవగాహన కార్యక్రమం ఐటీసీ బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా ఐటిసి ఎమ్మెస్ కే వాష్ ప్రోగ్రాం క్లస్టర్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు తడి పొడి ప్రమాదకర చెత్త పైన అవగాహన కల్పించారు . పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త ఎక్కడబడితే అక్కడ పడవేయరాదన్నారు. తడి పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ ట్రాక్టర్ కి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గం రజిత,కార్యదర్శి విజయ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, బాయమ్మ, పాఠశాల విద్యార్థులు,ఐ టి సి ఎం ఎస్ కే వాష్ ప్రోగ్రామ్స్ సిబ్బంది వెంకటేశ్వరరావు, ప్రసాదు, సందీప్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: