మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 7 : మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం మెచ్చా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి వారి ఊరేగింపులో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోయిన పల్లి సుధాకర్ రావు,స్థానిక సర్పంచ్ బోడా పద్మ, పర్సా వెంకటేశ్వరరావు,మండల యువజన విభాగం నాయకులు హరీశ్ రావు, టిఆర్ఎస్ నాయకులు మరిధు వేణు,చల్లా రాంబాబు,పరంకుశ రాజా,జమలయ్య ,జంగాల ఉమ తదితరులు పాల్గొన్నారు....
Navigation
Post A Comment: