CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా - టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట నవంబర్ 7: అశ్వారావుపేట మండలం తహసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ చల్లా ప్రసాద్, అటవీ శాఖ అధికారి రేంజర్ అబ్దుల్ రెహమాన్ గిరిజనులతో పోడు భూముల సమస్య కొరకు జరిగిన సమావేశంలో టీపీసీసీ మెంబర్, ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపాక గిరిజన కాలనీలో 2001 సంవత్సరం నుంచి 200 ఎకరాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను ప్లాంటేషన్ కోసం అటవీ శాఖ అధికారులు గిరిజనులు కలిసి చెరి 100 ఎకరాల అని ఒప్పందం చేసుకున్నారు. అట్టి ఒప్పందాన్ని అటవీశాఖ అధికారులు ఉల్లంఘించి మూడు నెలల క్రితం కొత్త తవ్వకాలు తవ్వి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి ఆరోపించారు. గిరిజనుల సాగు చేసుకుంటున్నా పోడు భూములు సర్వే సమస్యపై జిల్లా కలెక్టర్, ఐటీడిఏ పిఓ దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం జరిగేలా చేస్తాననీ, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటుందని ఆమె తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: