మన్యం న్యూస్ ,వాజేడు: మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ ఆవరణంలో సివిక్ యాక్షన్ కార్యక్రమాన్ని మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురం సిఐ కే.శివ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు . ప్రజలు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల సంచారం పోలీస్ శాఖకు అందజేయాలన్నారు.ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.అనంతరం బొల్లారం, బిజినపల్లి, దూలాపురం, ములకనపల్లి, ముత్తారం కాలనీ, పెనుగోలు గ్రామ ప్రజలకు దోమతెరలు, సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎస్సై తిరుపతిరావు, సిఆర్పిఎఫ్ ఎస్సై షిమోన్, ఎస్సై ఇమ్మునేల్, ఏఎస్ఐ షరీఫ్, సిఆర్పిఎఫ్ ఎస్ ఐ ఎస్, నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: