మన్యం న్యూస్,సారపాక:
సారపాక సుందరయ్య నగరంలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల ఆధ్వర్యంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. గోదావరి కరకట్ట నిర్మించాలని, మంచినీళ్లు,కరెంట్ ,రోడ్లు, డ్రైనేజీలు, ఇంటి పన్ను ,ఇంటి నెంబర్లను పరిష్కరించాలని సిపిఎంమండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు కోరారు. కాగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సుందరయ్య నగరంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకురాలు పాపినేని సరోజన, ఎస్కే అబీద, పార్టీ సభ్యులు పాలపాటి వేణు, విలాసాగర్, రజిని, కౌవులూరి నాగమణి, కానితి నాగయ్య,
తోట సీత కుమారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: