- ఎమ్మెల్యే సీతక్క పై విమర్శలు చేసే నైతిక హక్కు తెరాస నాయకులకు లేదు
- మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యోరి యన్నయ్య
మన్యం న్యూస్, మంగపేట, నవంబర్ 17 ఎమ్మెల్యే సీతక్క పై విమర్శలు చేసే నైతిక హక్కు తెరాస నాయకులకు లేదని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యోరి యన్నయ్య స్పష్టం చేశారు
గురువారం మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల సోషల్ మీడియా, విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు
ఎమ్మెల్యే సీతక్క కేవలం గోత్తెకోయ వర్గానికి మాత్రమే సహాయం చేస్తున్నారు అని తెరాస పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీతక్క ఒక్క గిరిజన కులానికి మాత్రమే కాదు, కులాలకు, మతాలకు అతీతంగా ఉంటున్న ఎమ్మెల్యే సీతక్క. కరోనాకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి గడప కు బియ్యం తో పాటు నిత్యావసర సరుకుల చేరవేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు అటువంటి సేవాభావం కలిగిన మనిషిపై విమర్శలు చేసే హక్కు తెరాస నాయకులకు లేదని, ఇటువంటి చౌక బారు విమర్శలకు సమాధానం సీతక్క అంటే ఏమిటో తెలిసిన ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
Post A Comment: