మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ కూన దయానంద స్వామి గురువారం సందర్శించారు. ఆసుపత్రి సౌకర్యాల గురించి స్థానిక వైద్యాధికారి బలుసు శ్రీధర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులను కలిసి సిబ్బంది వైద్య సేవలపై ఆరా తీశారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య విధాన పరిషత్ లోకి మార్పు పరిశీలనలో భాగంగా సందర్శించినట్లు ఆయన తెలిపారు.
Navigation
Post A Comment: