మన్యం న్యూస్ , నవంబర్ 7, వాజేడు:
సోమవారం కార్తీక పౌర్ణమి రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రియులు,తెలంగాణ నయాగార బొగత జలపాతానికి సందడి కోలాహలం కనబడుతుంది.ఈ ప్రకృతి సోయగాలను పలుమార్లు చూసిన తనివి తీరదు, బొగత జలపాతం అంటే ఒక అద్భుతం, ఎత్తయిన కొండలు, దట్టమైన అడవి, పచ్చని చెట్ల మధ్యనుండి జాలువారుతున్న జలపాతాన్ని వీక్షించటానికి పలు రాష్ట్రాల, జిల్లాల, నుండి పర్యటకులు వచ్చి అహల్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో పరవశించి పోతారు. సమీపంలో ఉన్న గుట్టపైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి భక్తుల సందడి పెరిగింది.
Post A Comment: