మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 2:జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గల ముస్లింల స్మశాన వాటికకు సిసి రోడ్డు మంజూరు చేయాలని, జామా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. వర్షాకాల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రత్యేక చొరవ చూపి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జామ మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ సిద్దిఖ్, కమిటీ సభ్యులు షేక్ బాబు, షేక్ యుసఫ్, కోఅప్షన్ సభ్యులు షేక్ లతీఫ్, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ సుభాని, ముస్లిం సోదరులు సల్మాన్ ఖాన్, పాషా, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: