మన్యం న్యూస్, దుమ్ముగూడెం, నవంబర్ 2::
మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన దళాయి స్థాయి లక్ష్మి కుటుంబానికి మండలానికి చెందిన ఎలమంచి సీతారామయ్య ట్రస్టు సభ్యులు అండగా నిలిచి వారికి వంట సామాగ్రి గ్యాస్ బండ స్టవ్వు 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ట్రస్టు సభ్యులు అలానే ఎంపీటీసీ వంశీకృష్ణ మాట్లాడుతూ గూడు కోల్పోయిన సాయి లక్ష్మి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్టు కన్వీనర్ ఎలమంచి శ్రీనుబాబు స్థానిక సర్పంచి రాజేష్ శాఖ కార్యదర్శి నరసింహ రావు బైరెడ్డి సతీష్ శ్రీనాథ్ రావు వేణు రవీందర్ సతీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: