మన్యం న్యూస్,అశ్వాపురం:
పీడిత ప్రజల భూమికోసం భుక్తి కోసం సమ సమాజ స్థాపనకై అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని వారి ఆశయ సాధనకై కృషి చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు ఏరియా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు అన్నారు, నవంబర్ 1 నుండి నవంబర్ 9 వరకు అమరవీరుల వర్ధంతులు జరపాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అశ్వాపురం లోని కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావు స్తూపం వద్ద బుధవారం నాడు జెండా ఆవిష్కరణ చేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరులు పోలీసు ఎన్ కౌంటర్ లలో, మరికొందరు అనారోగ్యాలతో చనిపోయారని వారి త్యాగాలను మరువలేనివని అన్నారు. ఈ సందర్భంగా జోహార్ అమరవీరులకు, సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలు సాధిస్తాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అమరులకు నివాళులర్పించారు కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావు, కామ్రేడ్ బిజ్జం వెంకన్న, కామ్రేడ్ సూర్యనారాయణలను పోలీసులు తీవ్రచిత్రహింసలు పెట్టి మామిళ్ళ వాయి గుట్టలలో కాల్చి చంపారని, తొలి అమరుడు బత్తుల వెంకటేశ్వరరావు నాటి అనుచరులు కంచర్ల జనార్ధన్ , ఏనిక ఎల్లయ్య, సోడే దారయ్య లు నాటి బూటకపు ఎన్ కౌంటర్ సంఘటనను గుర్తు చేసుకున్నారు, అరుణోదయ కళాకారులు కొండలరావు అమరవీరులను స్మరిస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి పేదగోని ఆదిలక్ష్మి, అరుణోదయ గాయకుడు జక్కం కొండలరావు, నాయకులు సాధనపల్లి రవి, కంచర్ల జనార్దన్, చుక్కయ్య, పెద్దపల్లి శ్రీను, సోమయ్య,యం సంతోష్, నాగార్జున, చుక్కమ్మ, యల్లయ్య, దారయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: