- ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట దమ్మపేట పాల్వంచ రహదారి పై భారీ రాస్తారోకో
- సర్వే చేయకపొతే విల్లంబులు తో రోడ్డు ఎక్కుతాం -సిపిఐ రాష్ట్ర నేత నరాటి ప్రసాద్ హెచ్చరిక
- ఆందోళన వద్దకు వచ్చి హామీ ఇచ్చిన తహసీల్దార్
మన్యం న్యూస్ :ములకలపల్లి (నవంబర్ 05):
గత 40 ఏళ్లుగా వలస వచ్చి అడివిలో పోడు కొట్టి, ఇల్లు కట్టి పెండ్లి పిల్లలను కని పెంచి పెద్ద అయి చావులు కూడా ఇక్కడే చేస్తున్న వలస ఆదివాసీ బిడ్డలకు చెందిన పోడు భూములను పట్టా ల కోసం సర్వే చెయ్యకుండా ఇబ్బందులు పెట్టడం పై మండలం లో గల వలస ఆదివాసి గిరిజనలు ప్రభుత్వం పై,అధికారుల పై ఆగ్రహం తో సిపిఐ అద్వర్యంలో రాస్తారోకోనిర్వహించారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ వలస ఆదివాసులు అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న పోడు భూములను, తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన పొడుభూముల సెర్వే లొ మా వలస ఆదివాసీ గిరిజనుల భూములను పట్టాల కోసం సర్వే చేయకపోవట దుర్మార్గమైన చర్య అని అన్నారు.ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారికీ పోడు పట్టాలు ఇవ్వాలని, ఎస్ టి కులం సర్టిఫికెట్ ఇవ్వలని డిమాండ్ చేసారు, తెలంగాణ లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓట్ కార్డు, ఉపాధి కార్డు, పెన్షన్, హాస్టల్ చదువులు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం పోడు భూములకు పట్ట్టాలు ఇవ్వకపోవటం అన్యాయమని,తక్షణం పోడు భూమి సెర్వే అన్ని గ్రామాల్లో చేయాలని డిమాండ్ చేసారు.ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట బారీ ఎత్తున వచ్చిన ప్రజలతో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ వీరబద్రం వచ్చి పోడు సర్వేకు ఉన్నత అధికారాలతో మాటలాడి, సర్వే చే పిస్తామని హామీ తొ రాస్తారోకో విరమించారు .ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు ఎండీ యూసుఫ్ ,నరాటి రమేష్ ,వీరు నాయక్ ,ఇమ్మానియల్ , కుమార్,సత్యం,ముకేశ్ ,ఎర్మ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: