సారపాక, నవంబర్ 5, మన్యం న్యూస్ :
డీసీఎం వ్యాను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది.
మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ప్రాంతంలో శనివారం రాత్రి డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడు మండల పరిధిలోని కృష్ణసాగర్ హాస్టల్ లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. ఆయన తన స్వగ్రామం ఇల్లందు నుండి ద్విచక్ర వాహనంపై కృష్ణ సాగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: