CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 14.. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి పల్లి ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు . ప్రధానోపాధ్యాయురాలు మేకల జ్యోతి రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిడిపిఓ కనకదుర్గ, శ్రీనగర్ కాలనీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, ఎస్బిఐ లక్ష్మీదేవి పల్లి శాఖ మేనేజర్ మురళి , శ్రీనగర్ ఎంపీటీసీ కొల్లు పద్మ పాల్గొన్నారు. ఉపసర్పంచ్ రమేష్ చంద్ మాట్లాడుతూ

నేటి బాలలే రేపటి పౌరులనీ చాచా నెహ్రూ కి పిల్లలు అంటే ఎంతో ఇష్టమని అందుకనే వారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డే గా జరుపుకోవడం జరుగుతుందని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లో కూడా రాణించాలని, తల్లిదండ్రులు,పెద్దలపట్ల గౌరవం మర్యాదలతో ఉండాలని చిన్ననాటి నుండి మంచి లక్షణాలతో ఎదగాలని చెప్పారు.

ఈ సందర్భంగా జరిగిన విద్యార్థుల నృత్యరూపకాన్ని, జాతీయ నాయకుల గురించి విద్యార్థుల యొక్క ప్రసంగాన్ని విని వారిని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పాషా, టీవీపిఎస్ అధ్యక్షులు గుండపనేని.సతీశ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి కాసిం, రిటైర్డ్ డిప్యూటీ తాహసిల్దార్ నాగరాజు ప్రమీల దంపతులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: