CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత..

Share it:



  •  మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత..
  • మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాలు...

 మన్యం న్యూస్ చండ్రుగొండ నవంబర్ 14 : మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవ సంబరాలు ముగించుకొని పాఠశాలలోని 111 మంది విద్యార్థులు మధ్యాహ్నభోజనాన్ని తిన్నారు. ఈ క్రమంలో సుమారు గంటన్నర సమయం తరువాత విద్యార్థులు క్రమంగా దగ్గడం, అస్వస్థతకు గురవ్వడాన్ని ఉపాధ్యాయులు గమనించి, స్థానిక ఏఎన్ఎంతో  ప్రాథమిక వైద్యం అందించారు. కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సాయంత్రం చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రధానోపాధ్యాయుడు జుంకీలాల్ 11 మంది విద్యార్థులను ఆటోలో తరలించారు. మరో నలుగురు విద్యార్థులు ఇంటికెళ్లిన తరువాత ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు సైతం ఇదే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వీరందరికీ మెడికల్ ఆఫీసర్ వెంకటప్రకాష్ వైద్యం అందిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ తో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలన్నారు. అవసరం అయితే కొత్తగూడెం, ఖమ్మం ఆసుపత్రులకు తరలించాలని సూచించారు

Share it:

TELANGANA

Post A Comment: