మన్యం న్యూస్, గుండాల (నవంబర్ 01):మండలంలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ హెచ్చరించారు. మంగళవారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఆకస్మికంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఉత్తమంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. మర్కోడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సక్రమంగా పనితీరు కనపరచని సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కృష్ణయ్య, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ నాగ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: