జూలూరుపాడు, నవంబర్ 01, ( మన్యం న్యూస్) : ఎక్సైజ్ ఎహెచ్ఓ ఎన్ నరేందర్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ ఎస్ఐ సాయికుమార్ తమ సిబ్బందితో మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్న, అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకుని, జూలూరుపాడు తహశీల్దార్ లూథర్ విల్సన్ ఎదుట హాజరుపరిచారు. సూరారం గ్రామానికి చెందిన దారవత్ నాగమణి, చింతలచెరువు బిక్షం, కొర్రా మంగీలాల్, బచ్చల అమలా, కొర్ర నాగ్య, కరివారిగూడెం గ్రామానికి చెందిన గుగూలోత్ సత్యవతి, భూక్యా మంగినీ, భూక్యా లక్ష్మి, భీమ్ల తండా కు చెందిన గుగూలోత్ జ్యోతి, గుగూలోత్ రజనీ, అన్నారుపాడు గ్రామానికి చెందిన బాణోత్ భద్రం, బాణోత్ విజయ దుబ్బతండా కు చెందిన లకావత్ బద్రి, కాకర్ల గ్రామానికి చెందిన సోంపల్లి విజయలక్ష్మి లను తహశీల్దార్ ముందు బైయిండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిబ్బంది, హెచ్ సి ప్రకాష్ రావు, ఇసి విజయ్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: