మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నవంబర్ 01:
రూ 33 లక్షలు విలువగల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పాల్వంచ రూరల్ ఎస్సై శ్రీనివాస్ కదనం ప్రకారం మండల పరిధిలోని సోములగూడెం క్రాస్ రోడ్డు వద్ద మంగళ వారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఓ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 165 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ 33 లక్షలు ఉంటుందని అంచనా వేశారు
Post A Comment: