మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన లావణ్య అనే వివాహిత బయ్యారం పోలీస్ స్టేషన్ లో తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గడ్డంపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రోజుల నుండి అదనపు కట్నం కావాలని భార్య లావణ్యను వేధించడం ప్రారంభించాడు. భర్త వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ టివిఆర్ సూరి తెలిపారు.
Post A Comment: