CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతిఘటన పోరాటాలతోనే ప్రజల సమస్యలు సాధ్యం : న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు

Share it:


మన్యం న్యూస్, గుండాల, నవంబర్ (1) : ప్రతిఘటన పోరాటాలతోనే ప్రజల సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించరు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం ఎందరో ఉద్యమకారులు తమ విలువైన ప్రాణాలను సైతం అర్పించారని అన్నారు. చంద్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బాత్తుల వెంకటేశ్వరరావు, గడ్డం వెంకట్రామయ్య , బాటన్న , లింగన్న కాచనపల్లి అమరవీరులు ఉద్యమం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదన్నారు. ఎల్లన్నలాంటి మహనీయులు ఉద్యమం కోసం అసువులు భాషారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు,పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్ , పరిషిక రవి, వై వెంకన్న , రంగన్న, గడ్డం లాలయ్య, అస్గర్, కృష్ణన్న , పెంటన్న, మంగన్న, ఎల్లన్న , తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: