మన్యం న్యూస్, గుండాల, నవంబర్ (1): అమరుల త్యాగాల స్ఫూర్తితో ఉద్యమంలో ముందుకు సాగుదాం అని ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజా పంధా పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. దేశంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలను పన్నుల పేరుతో వారి రక్తాన్ని జనగాల్ల పేల్చి తిప్పి చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం వర్గ పోరాటాలను నిర్మిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య, రాయల చంద్రశేఖర్, కేచ్చల రంగారెడ్డి, చిన్న చంద్రన్న , చంద్ర అరుణ, నాయిని రాజు, మాచర్ల సత్యం, బాస్, వాంకుడోత్ అజయ్, అజ్మీర బిచ్చ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: