CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ పై దాడినీ నిరసిస్తూ వాజేడులో ర్యాలీ.

Share it:


మన్యం న్యూస్, వాజేడు.:

 మునుగోడు ఉప ఎన్నికల్లో  పలివెల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్న ములుగు జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ పై, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి పై బిజెపి గుండాలు దౌర్జన్యంగా రాళ్లతో దాడి చేసినందుకు నిరసనగా, టిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో వాజేడు మండల కేంద్రంలో బిజెపి పార్టీ గుండాలకి వ్యతిరేకంగా  ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలు ఓటు రూపంలో బిజెపి పార్టీని బొంద పెడతారని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, గెలుపుని జీయనించుకోలేక బిజెపి పార్టీ భౌతిక దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి సభ్యురాలు తల్లడి పుష్పలత, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గొంది రమణ రావు, జిల్లా రైతుబంధు కార్యవర్గ సభ్యులు తల్లడి నాని బాబు, చింతూరు సర్పంచ్ తెల్లం బుల్లేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నిజాముద్దీన్, నాగారం ఉప సర్పంచ్ కల్లూరు సతీష్ ,మండల జాయింట్ సెక్రెటరీ చెన్నం సాంబశివరావు, టిఆర్ఎస్ నాయకులు సాగి ప్రసాద్ రాజు, విశ్వనాథ ,ప్రసాదరాజు, సెగ్గం ప్రశాంత్ భువనగిరి, సాయికుమార్, జీవన్ చెన్నం స్వామి, మధ్యబోయిన శ్రీను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసం కృష్ణయ్య ,ఎట్టి లక్ష్మయ్య, గఫార్, మద్దూరి రవి పోలిశెట్టి సరబాబు ,గౌరబోయిన శ్రీకాంత్ పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు దంతులూరు సూర్యనారాయణ ,వర్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: