నేటికీ చెక్కుచెదరని పోలీస్ వంతెన
అప్పటి గుండాల ఎస్సై ముత్యం రమేష్ కృషి చిరస్మరణీయం
ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మన్యం న్యూస్ గుండాల, నవంబర్ 19.. కిన్నెరసాని వాగుపై తాత్కాలిక వంతెనను గుండాల పోలీస్ శాఖ 2021లో ఏర్పాటు చేసింది. ఉన్నత అధికారుల సూచనతో సీఐ శ్రీనివాస్ చొరవతో అప్పటి గుండాల ఎస్సై, ప్రస్తుత మణుగూరు సిఐ అయిన ముత్యం రమేష్ ఈ వంతెన పనిలో నిమగ్నమయి పూర్తి చేయించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు వాగు ఉప్పొంగి నప్పుడల్లా కర్రల వంతెన ను ఏర్పాటు చేసుకొని దానిమీద నుండి ప్రమాదమని తెలిసినా దాటాల్సి నా పరిస్థితి నెల కొనేది. పత్రికల్లో కర్రల వంతెన కథనం ప్రచురణ కావడంతో స్పందించిన పోలీస్ శాఖ తాత్కాలిక వంతెనను పకడ్బందీగా ఏర్పాటు చేసింది. గుండాల ఎస్సైముత్యం రమేష్ గిరిజనులతో కలిసి సిబ్బందితో వంతెనపై అటుఇటు నడిచి వంతెన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా కిన్నెరసాని వాగుపై ప్రమాదాలు పొంచిఉన్న గిరిజనులు మాత్రం దాటాల్సి నా పరిస్థితి నెల కొనేది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ ఉన్నత అధికారులు ఎస్సై ముత్యం రమేష్ కు సూచనలు చేయడంతో తక్షణమే స్పందించిన ఆయన ఒకే రోజులోనే తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. ఏదైతేనేమి ప్రజలు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక వంతెనపై నుండి సాఫీగా రాకపోకలను సాగిస్తున్నారు. ఇదంతా దగ్గరుండి పూర్తి చేయించిన గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ తో పాటు పోలీస్ ఉన్నత అధికారులకు ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు
Post A Comment: