మన్యం న్యూస్ , గుండాల, నవంబర్ 19 ..విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించినప్పుడే వారు చదువులో రాణిస్తారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి అన్నారు. శనివారం కళాశాలలో పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగేశ్వరరావు తో పిల్లలకు వ్యక్తిగత వికాసం పై అవగాహన తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలపై క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా నాగేశ్వరరావు వివరించారు. ఈ అవగాహన తరగతులు విజయవంతం కావడానికి కారణకులైన గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ కు ప్రత్యేక ధన్యవాదాలు ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో ఎక్కువ మొత్తంలో ఈ క్లాసులు నిర్వహించే విధంగా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .
Navigation
Post A Comment: