మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:పిడిఎస్ బియ్యం విక్రయిస్తే ఆయా వ్యక్తుల ఫుడ్ సెక్యురిటి కార్డు రద్దు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం
రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఈ నెల కోటాలో 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి తెలిపారు. పిడిఎస్ బియ్యం విక్రయాలకు పాల్పడితే వారి సమాచారం సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి త్రినాధ్ బాబు, జీసీసీ డీఎం వాణి, ఎల్ఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జి రవి, ఉప తహసీల్దార్లు కె. వెంకటేశ్వర్లు, సోయం కృష్ణ, శ్రీనివాస్, మహేష్, ఆర్ఐ ఎస్. కె. బాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: