విధులను బహిష్కరించిన మణుగూరున్యాయవాదులు
*ఇల్లందు కోర్టు ఆవరణలో న్యాయవాది ఎస్. సత్యనారాయణ పై జరిగిన దాడి హేయమైనది:బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజయరావు
మన్యం న్యూస్,మణుగూరు టౌన్:మండల పరిధిలో ని మణుగూరున్యాయవాదులుఇల్లందు కోర్టు ఆవరణలో న్యాయవాది ఎస్. సత్యనారాయణ పై జరిగిన దాడి కి నిరసనగాగురువారం విధులను బహిష్కరించడం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగామణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజయరావు మాట్లాడుతూ.. న్యాయవాదులపై దుండగుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు చిర్ర రవి కందిమల్ల నరసింహారావు జాడి చొక్కాయ వెంకటరత్నం పోశం భాస్కర్ శైలజ సంధ్య కవిత సావిత్రి బిక్కసాని శ్రీనివాస్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: