మన్యం న్యూస్,కరకగూడెం:
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షత గురువారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికార పార్టీలో చేరి ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు.తక్షణమే ఎమ్మెల్యే రేగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ ,మండల నాయకులు కొరగట్ల విశ్వనాథం ,చెన్నూరి రవీందర్ ,పోలెబోయిన సీతరాంబాబు , రేగుళ్ళ గ్రామ అధ్యక్షులు గోగు కిరణ్ ,చెన్నూరి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: