మన్యం న్యూస్ ,దమ్మపేట : దమ్మపేట మండలంలో దురదపాడు గ్రామ సమీపన రోడ్డుపై వరి ధాన్యం ఆరబోసి కుప్పలుగా ఉండటం వలన రాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. దమ్మపేట నుండి అన్నపురెడ్డిపల్లి వెళ్తున్న ప్రతాప్ అనే వాహనదారుడుకి దురదపాడులో ఒడ్లు గుట్టలుగా ఆరంబోసి నల్లపర్ద కప్పి ఉండటం వలన రాత్రిపూట కనిపించలేదు. ఇలా అన్నిచోట్ల రోడ్లపై గుట్టల గుట్టలుగా ఆరబోసి ఉండటం వలన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. వీటిని గూర్చి రైతులకు అవగాహన కల్పించి ఇలా రోడ్లపై ఆరపోయకూడదని తగిన సూచనలు ఇవ్వాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.
Navigation
Post A Comment: