మన్యం న్యూస్, దుమ్ముగూడెం, నవంబర్ 5::
మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ పిల్లలందరికీ టి డి వ్యాక్సిన్ చేపించాలని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ం వైద్యులు డాక్టర్ చైతన్య అన్నారు శనివారం నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో టీడీ టీకాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో వైద్యాధికారి మాట్లాడుతూ నవంబర్ 7వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రతి పాఠశాల లో ఐదో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు టిడి వ్యాక్సినేషన్ గురించి వివరించి చేపించాలని తెలిపారు అలానే వ్యాక్సినేషన్ తర్వాత పిల్లలందరినీ 30 నిమిషాలు అబ్జర్వేషన్ ఉంచిన తరువాత పంపించాలని ఆశా కార్యకర్తల కు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో హెచ్ వి రాంబాబు రామారావు హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు బాబురావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: