CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

త్వరలో మండల కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు

Share it:


 

     - కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణా  శిబిరం...

    - విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందిస్తాం...

    - శారీరక సామర్థ్యం కొరకు షూస్, రన్నింగ్ ట్రాక్స్ పంపిణీ చేస్తాం...

    -  త్వరలో మండల కేంద్రంలో వాలీబాల్ పోటీల నిర్వహణ...

    - యువత చేతిలోనే  దేశ భవిష్యత్తు...
    - జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ వెల్లడి...


మన్యం న్యూస్ ,దుమ్ముగూడెం/ చర్ల,  : మండల కేంద్రంలో త్వరలో క్రీడా మైదానం ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ వెల్లడించారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువతకు వాలీబాల్ కిట్లు, విద్యార్థినీ, విద్యార్థులకు సోలార్ లైట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చర్ల సీఐ బి అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గాల వైపు పయనించకుండా తమ శక్తి సామర్థ్యాల మేరకు వివిధ రంగాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, పోలీసులు స్నేహపూర్వక సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు.త్వరలోనే మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు త్వరలోనే పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల శారీరక సామర్థ్యం కొరకు దుమ్మగూడెం చర్ల మండలాలకు చెందిన  వారికి ఉచితంగా షూస్, రన్నింగ్ ట్రాక్స్ అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఓఎస్డి టి సాయి మనోహర్ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలో యువత అన్ని రంగాలలో ముందుండి మండలానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. భద్రాచలం ఏ ఎస్ పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ చర్ల మండలంలో పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఉదాహరణగా నిలవడం ఎంతో అభినందనీయమని అన్నారు. చర్ల సీఐ బి అశోక్ నేతృత్వంలోని చర్ల పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా పోలీసులకే ఆదర్శంగా నిలవడం పట్ల పోలీసులను అభినందించారు.చర్ల సిఐ బి అశోక్ మాట్లాడుతూ యువత క్రీడలలో రాణించి, దారుఢ్యాన్ని  పెంపొందించుకోవాలని సూచించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 వాలీబాల్ టీములకు వాలీబాల్స్, నెట్లు పంపిణీ చేసినట్లు, 300 మంది విద్యార్థులకు సోలార్ లైట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, ఓ ఎస్ డి టి సాయి మనోహర్, భద్రాచలం ఏ ఎస్ పి రోహిత్ రాజ్ సహాయ సహకారాలతో మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆదివాసి గిరిజన ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ డర్, సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, చర్ల ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య, చర్ల బి కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ సోమజిత్ భగత్, 81 కమాండెంట్ సంజయ్ కుమార్ స్థానిక పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన యువకులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: