CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా కమ్మ మహజన వన భోజన మహోత్సవం...

Share it:


 మన్యం న్యూస్, మణుగూరు: కమ్మ మహాజన వనభోజన మహోత్సవ కార్యక్రమం సమ్మక్క సారలమ్మ గుడి వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి పోశం నరసింహారావు,  దండ రాధాకృష్ణలు హాజరై మాట్లాడారు. కమ్మ మహాజన సోదరులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కుడితిపూడి కుటుంబ సభ్యులు కమ్మ మహజన సంఘం కమ్యూనిటీ హాల్ కు నాలుగ ఎకరాల స్థలాన్ని వితరణగా అందజేశారు. అనంతరం నూతన క్యాలెండర్ ఆవిష్కరించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. మణుగూరు నూతన కమిటీ ప్రెసిడెంట్ గా  వీరపనేని చెన్నకేశవులు, సెక్రటరీగా మల్లీడి లోకేశ్వరరావు,  ట్రెజరర్ గా యలమాటి పూర్ణచందర్రావు, వైస్ ప్రెసిడెంట్ గా దొడ్డ తిరుపతిరావు, జాయింట్ సెక్రటరీగా దారపునేని హరి , ఆర్గనైజేషన్ సెక్రటరీ గా జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా పుచ్చకాయల శంకర్, పిఆర్వోగా దొడ్డపునేని రామ్ గోపాల్ , లీగల్ అడ్వైజర్ గా పోషం భాస్కర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నామ వెంకటేశ్వరరావు,  పెమ్మసాని సుబ్బారావు, దొబ్బల వెంకటప్పయ్య,  లక్ష్మయ్య చౌదరి , ఆడప అప్పారావు ,మెదరమెట్ల యాదగిరి,  గుడిపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: