మన్యం న్యూస్, ఏటూరు నాగారం:
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పై బిజెపి పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ ఆదివాసి సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పై ప్రజల ఆదరణను చూసి గెలవలేక ఓడిపోతామనే భయంతో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, మునుగోడు ప్రజలు ఈ ఉప ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని,రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
Post A Comment: