పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగాకాంతరావు తోనే సాధ్యం.
-మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని
-యూత్ గ్రామ కమిటీ ఎన్నిక
మన్యం న్యూస్, బూర్గంపాడు, నవంబర్ 1: మండల కేంద్రము లోని మార్కెట్ యార్డ్ లో టిఆర్ఎస్ యువజన విభాగం సమావేశం మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పినపాక నియోజక యూత్ సభ్యులూ మండల యూత్ ఇంచార్జ్ హర్ష నాయుడు పాల్గోని మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని , నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమని యువత మొత్తం రేగా కాంతారావు తో అడుగులు వేసి ముందుకు సాగాలని యువతకు సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది గ్రామ యూత్ అధ్యక్షుడిగా కన్నెపిల్ల సతీష్, ప్రధాన కార్యదర్శిగా శ్యామకురి సతీష్, ఉపాధ్యక్షులుగా బర్లకామేశ్వరరావు, కేసుపాక రామకృష్ణ లను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి యడమ కంటి సుధాకరరెడ్డి , మండల వైస్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి ,నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల కోటి పూర్ణ చంద్ర , విద్యార్థి విభాగ నాయకులు వంశీ, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు , సారపాక టౌన్ ఉపాధ్యక్షులు చిరంజీవి మండల యూత్ నాయకులు తోకాల సతీష్, కోట రమేష్ ,కేసుపాక మాహేష్, మందా ప్రసాద్,కుమ్మరి పల్లి నాగరాజు, గుండె సతీష్, తోకల శివ, తోకలా నాగరాజు, తోకల పండు, వంశీ ,విజయ్, డెగల నవీన్, సాయి రామ్, యువత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: