సారపాక, నవంబర్ 4, మన్యం న్యూస్ :
మెట్ట ప్రాంతాల్లో వరద బాధితులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో గోదావరి వరద బాధితులు నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సర్వం కోల్పోయారని గుర్తు చేశారు. వరద బాధితులకు మెట్ట ప్రాంతాల్లో పక్కా ఇండ్ల నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులు తమకు పక్కా ఇండ్లను ఇవ్వాలని సుమారుగా మూడు నెలల నుంచి మొరపెట్టుకుంటున్న ఇటు అధికార యంత్రాంగం గాని, అటు ప్రభుత్వ యంత్రాంగం గాని స్పష్టత ఇవ్వకపోవడం హేయమని ఆయన విమర్శించారు. ఇకనైనా వరద బాధితుల సమస్యను ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు బండ్ల వెంకటేశ్వర్లు, ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా కమిటీ నాయకులు వైఎస్ రెడ్డి, సత్యనారాయణ, మూతి మహాలక్ష్మి , బట్టు రవి, ఆర్ లక్ష్మి, పాష, వి.జ్యోతి, భద్రక్క, జీనత్, భూక్య మంగీలాల్, ముంతాజ్, వీరబాబు, మీనాక్షి, సాయి, విశాక్, టింగు మమత, వర్ష రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: