మన్యం న్యూస్: నవంబర్ 4 వాజేడు.
భారతదేశంలో 600కు పైగా ఆదిమ జాతులు ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 33 ఆదిమ తెగలు జీవనాన్ని కొనసాగిస్తున్నయి. చరిత్ర చూసినట్లయితే హిందూ ముస్లింల రాజ్యాస్థాపనలో భాగంగా దండయాత్రలు జరిగాయి, ఈ దండయాత్రలో ఆదివాసి రాజ్యాలు కోల్పోయారు. అంతే నాటి నుండి నేటి దాకా ఆదివాసి హక్కులు కాలరాస్తున్న పరిస్థితి అర్థం పడుతుంది.ఆదివాసుల అస్తిత్వ పోరాటం జరుగుతూనే ఉంది. ఆదివాసి ప్రజలారా మేల్కోండి జాతిని రక్షించుకుందాం! నవంబర్ మాసంలో 15 ,16 తేదీలలో సమ్మక్క, సారలమ్మ సన్నిధి మేడారంలో తుడుం దెబ్బ 8వ రాష్ట్ర మహాసభలను ఆదివాసి ప్రజలు జయప్రదం చేయాలని, తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాజేడు మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాయం, జానకి రమణ, సంతోష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: