మన్యం న్యూస్, ఇల్లందు, నవంబర్ 9 :
మండల పరిధిలోని రాగబోయినగుడెం పంచాయితీ పరిధిలోని స్థానిక పోడు రైతులు తాము సాగుచేసుకుంటున్న భూములు ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తీర్ణంలో వ్యాపించి భౌగోళికంగా ఇటు భద్రాద్రి అటు ఖమ్మం పరిదిలో ఉండటంతో సర్వే నిర్వహణలో కొంతమేర జాప్యం జరుగుతుందని భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కు స్థానిక రైతులు వివరించగా, వెంటనే స్పందించి కారేపల్లి,ఇల్లందు మండలాల అటవీ శాఖ రేంజర్ లతో చరవానీలో సంప్రదించి సమన్వయంతో సర్వే నిర్వహించి పోడు రైతులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు... ఈకార్యక్రమంలో వారివెంట స్థానిక సర్పంచ్ కున్సోత్ జానకీ,ఎంపీటీసీలు బియ్యని రజినీ,మండల రాము, పూనెం సురేందర్,నాయకులు కున్సిత్ రాము, బానోత్ శంకర్,పోషం మధు,సోముధల వీరభద్రం,బండి సుధాకర్, బియ్యని సుధాకర్,మడుగు సాంబమూర్తి, బొళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాస్,కాకటి భార్గవ్,బోర్ వెల్ రమేష్, కుంటా రాజు తదతరులు పాల్గొన్నారు.
Post A Comment: