మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేచర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని దేశ ప్రధాన నగరాలు మొదలుకొని, మండల కేంద్రాల వరకు మోడ్రన్ సెలూన్ షాపులు పెట్టాలనే ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అంబానీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియాల సత్యనారాయణ, మాడుగుల నాగరాజు, కడియాల పుల్లయ్య , వల్లోజు రమేష్, మాడుగుల నరేష్, మార్కాపురి నరసింహారావు, కడియాల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: