మన్యం న్యూస్, మణుగూరు: ఆత్మహత్య చేసుకుని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం మణుగూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా మణుగూరు ఏరియా పీవీ కాలనీ కి చెందిన పాలకుర్తి రాకేష్(32) అనే వ్యక్తి సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున తన క్వార్టర్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Navigation
Post A Comment: